Ratan Tata Passes Away: రతన్ టాటా కన్నుమూత.. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు.. లైవ్..

|

Oct 10, 2024 | 12:13 PM

పారిశ్రామికవేత్త రతన్‌టాటా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రతన్‌టాటా మృతిపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. కేంద్రమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు రతన్‌టాటా మృతిపట్ల సంతాపం తెలిపారు.

పారిశ్రామికవేత్త రతన్‌టాటా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రతన్‌టాటా మృతిపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. కేంద్రమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు రతన్‌టాటా మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రతన్ టాటా కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో రతన్ టాటా బుధవారం రాత్రి 11.30కి తుదిశ్వాస విడిచారు. కొలాబాలోని ఆయన ఇంటికి పార్ధీవదేహం తరలించారు. ఇవాళ ముంబై NCPAకు రతన్‌టాటా భౌతికకాయం తరలించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

Follow us on