ధనత్రయోదశి వేళ వెల్లువలా బంగారం, వెండి కొనుగోళ్లు వీడియో
ధనత్రయోదశి వేళ బంగారం, వెండి ధరలు కాస్త తగ్గడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జ్యువెలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. ఈ పండగ సీజన్లో రూ.50,000 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు జరుగుతాయని అంచనా. ముఖ్యంగా వెండి వస్తువుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి.
ధనత్రయోదశి పర్వదినం వేళ బంగారం, వెండి ధరలు కాస్త దిగిరావటంతో దేశవ్యాప్తంగా కొనుగోలుదారులలో పండగ వాతావరణం నెలకొంది. ఈసారి ధంతేరాస్ రెండు రోజులు ఉండటంతో గోల్డ్ ప్రియులు బంగారం షాపులకు పరుగులు తీశారు. శనివారం ఉదయం నుంచే దేశవ్యాప్తంగా జ్యువెలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. ధరలు తగ్గటంతో చాలామంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపించారు.
మరిన్ని వీడియోల కోసం :
