దీపావళి సీజన్ లో రికార్డ్ సేల్స్ వీడియోస్
ఈ దీపావళి సీజన్ భారత వ్యాపారులకు రికార్డు స్థాయి అమ్మకాలను తెచ్చిపెట్టింది. రిటైల్, హోల్సేల్, సేవా రంగాలు కలిసి గత ఏడాది అంచనాలైన ₹4.75 లక్షల కోట్లను అధిగమించాయి. కేవలం ధంతేరాస్ ఒక్క రోజే ₹1 లక్ష కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. వినియోగదారుల విశ్వాసం, స్థానిక ఉత్పత్తుల పట్ల మక్కువ ఈ వృద్ధికి దోహదపడ్డాయి.
దీపావళి పండుగ భారతీయ వ్యాపారులకు ఈ ఏడాది సువర్ణావకాశంగా నిలిచింది. దేశవ్యాప్తంగా రిటైల్, హోల్సేల్, సర్వీస్ రంగాలు కలిసి గత ఏడాది అంచనాలైన ₹4.75 లక్షల కోట్లను మించి రికార్డు స్థాయి వ్యాపారం సాధించాయి. పండుగకు ప్రజలు చూపిన ఉత్సాహం, ఆనందం షాపింగ్ సందడిని పెంచింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి కుటుంబం తమ బడ్జెట్కు తగ్గట్టుగా ఖర్చు చేసింది.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనాల ప్రకారం, ధంతేరాస్ పండుగ వేళ ఒక్క రోజులోనే రూ.1 లక్ష కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఇందులో బంగారం, వెండి అమ్మకాలు రూ.66,000 కోట్లకు పైగా ఉన్నట్లు CAIT పేర్కొంది. ప్రజలు సంప్రదాయబద్ధంగా బంగారం, వెండి, కొత్త పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలను కొనుగోలు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
