వాహనదారులకు బంపర్ ఆఫర్..తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Updated on: Mar 28, 2026 | 1:25 PM

అంతర్జాతీయ ఇంధన సంక్షోభం, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై పూర్తిగా సుంకాన్ని రద్దు చేస్తూ సామాన్యులకు భారీ ఊరటనిచ్చింది. హర్మూజ్ జలసంధి వద్ద ఆంక్షల కారణంగా ముడిచమురు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తగ్గింపు రవాణా ఖర్చులు, నిత్యావసరాల ధరలను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ ఇంధన సంక్షోభం వేళ భారతీయులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై సుంకం రూ. 3కి చేరగా, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. అమెరికా-ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తోంది. ముఖ్యంగా కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఆంక్షలు విధించడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచ ముడిచమురు సరఫరాలో దాదాపు 20 నుంచి 25 శాతం ఇదే మార్గం గుండా రవాణా అవుతోంది. భారత్ కూడా తన అవసరాల్లో 12 నుంచి 15 శాతం చమురును ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకునేది. యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం వల్ల రవాణా ఖర్చులు తగ్గి, నిత్యావసరాల ధరలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ప్రజలకు ఊరటనివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏప్రిల్ 1 నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే

సీతమ్మ కల్యాణానికి ‘పాలకోవ’ సారె

అయోధ్యలో అద్భుతం.. రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు

ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం

మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్

Follow Us