రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం.. డిసెంబరులో భారీ వసూళ్లు
డిసెంబర్ 2025లో భారత జీఎస్టీ వసూళ్లు రూ.1,74,550 కోట్లకు చేరి, 6.1% వృద్ధిని నమోదు చేశాయి. ఇది పండుగల తర్వాత కూడా దేశ ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయని సూచిస్తుంది. సెంట్రల్, స్టేట్ జీఎస్టీతో పాటు ఐజీఎస్టీ గణనీయంగా పెరిగాయి. పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్నుల విధానం 2026 ఫిబ్రవరి 1 నుండి అమలులోకి రానుంది, ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఇది మరింత బలం చేకూరుస్తుంది.
దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని సూచిస్తూ వస్తు, సేవల పన్ను వసూళ్లు మరోసారి ఆశాజనకమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 డిసెంబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.1,74,550 కోట్ల ఆదాయం సమకూరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2024 డిసెంబరులో నమోదైన రూ.1,64,556 కోట్లతో పోలిస్తే ఇది 6.1 శాతం అధికం కావడం గమనార్హం. పండుగల సీజన్ తర్వాత కూడా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. డిసెంబర్ నెల వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ (CGST) వాటా రూ.34,289 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ (SGST) వాటా రూ.41,368 కోట్లుగా ఉంది. ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) ద్వారా అత్యధికంగా రూ.98,894 కోట్లు వసూలయ్యాయి. రుణ బకాయిల చెల్లింపుల కోసం తాత్కాలికంగా కొనసాగిస్తున్న జీఎస్టీ పరిహార సెస్ రూపంలో ప్రభుత్వానికి మరో రూ.4,551 కోట్లు అందాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ సెస్ ద్వారా మొత్తం రూ.88,385 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు, డిసెంబరులో జీఎస్టీ రిఫండుల రూపంలో రూ.28,980 కోట్లను ప్రభుత్వం వెనక్కి చెల్లించింది. కొన్ని విలాసవంతమైన వస్తువులపై 40 శాతం వంటి కొత్త పన్నుల శ్లాబులు ప్రవేశపెట్టినప్పటికీ, పొగాకు, పాన్ మసాలా వంటి వాటిపై సెస్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 22 నుంచి కొన్ని వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడం వల్ల వసూళ్లు పెరగడం విశేషం. ఇదే సమయంలో, పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్నుల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇటీవలి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) చట్టం-2025 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ చట్టం పొగాకు ఉత్పత్తులపై కొత్త ఎక్సైజ్ సుంకం రేట్లను నిర్దేశిస్తుంది. దీనితో పాటు, పాన్ మసాలా తయారీపై సెస్ విధించే హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, 2025 కూడా అదే తేదీ నుంచి అమల్లోకి రానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యబాబోయ్.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్
ఎంతకు తెగించావురా !! రీల్స్ కోసం ఇంత రిస్క్
ఇంటిలోకి ప్రవేశించిన చిరుత.. సీసీటీవీ కెమెరాలో రికార్డ్
అయ్యబాబోయ్.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్
ఎంతకు తెగించావురా !! రీల్స్ కోసం ఇంత రిస్క్
అంతా ధనవంతులే.. చిన్న వయసులో సన్యాసం ఏంటి ??
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే
తప్పతాగి రెచ్చిపోయిన ఎస్ఐ.. ఏం చేశాడంటే
కనువిందు చేస్తున్న హిమపాతం.. పోటెత్తిన పర్యాటకులు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె

