Gold Price Today: మళ్లీ పెరిగి బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచ అనిశ్చితి, బలహీనపడిన డాలర్, పెట్టుబడుల మళ్లింపు దీనికి ప్రధాన కారణాలు. ఫిబ్రవరి 27న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,61,570కు, 22 క్యారెట్ల ధర రూ.500 పెరిగి రూ.1,48,100కు చేరింది. వెండి ధర రూ.2,95,000 వద్ద స్థిరంగా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ ధరలు పెరిగాయి.
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు బంగారం, వెండి ధరలను అమాంత పెంచేస్తున్నాయి. డాలర్ బలహీనపడటం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించడం బంగారం వెండి ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 27, శుక్రవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల 10 గ్రాముల Gold ధర రూ.550 పెరిగి రూ.1,61,570 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.1,48,100 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర మాత్రం రూ.2,95,000లతో స్థిరంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 27, గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,720 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,250 పలుకుతోంది. ముంబై, కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,61,570 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,48,100 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,550 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,49,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,570 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,100 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,95,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
90 డేస్ పిటిషన్పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?
Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు
తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు
అనిల్ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే
