మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ ప్రకారం… మరో వారం రోజుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే.. మంత్రి రాంప్రసాద్రెడ్డి ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధానంగా చర్చించారు. అతి తర్వలోనే మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. అయితే ఈనెల 12న మరోసారి ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. ఆ తర్వాత… ఎప్పటి నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం అనేదానిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..