ఏపీలో 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు వీడియో
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడి రేపు దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఏపీలో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా, రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
Loading...
Unable to load recommendations.
Follow Us
