SUV Stolen: చోరీ చేసిన స్కార్పియో రాజస్థాన్లో వదిలేసిన దొంగలు.. క్షమించాలని కోరుతూ నోట్
కారు నంబరు ఉండడంతో ఆ కారు ఎక్కడిది..? ఎవరిది అనే విషయాన్ని గుర్తించడం పోలీసులకు సులువైంది. ఐ లవ్ మై ఇండియా అని మరో నోట్లో రాసింది. ఇక, విండ్స్క్రీన్పై రాసిన మూడో నోట్లో ఈ కారు ఢిల్లీ నుంచి దొంగిలించబడిందని రాసి ఉంది. దయచేసి పోలీసులకు కాల్ చేసి వారికి తెలియజేయండి.
సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సార్లు దొంగతనం ఘటనలు కూడా చూస్తుంటాం. వీటిలో కొన్ని చోరీ కేసులు విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు దొంగలు దొంగతనం చేసేందుకు వచ్చి అక్కడే గుర్రుపెట్టి నిద్రపోయిన ఘటనలు కూడా చూశాం. మరికొందరు దొంగలు చోరీ చేసేందుకు వచ్చి ఫుటుగా తాగేసి మత్తులో పట్టుబడిన వార్తలు కూడా చూశాం. ఇదిలా ఉంటే రాజస్థాన్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ ఒక పాడుబడిన కారుపై మూడు వింత పోస్టర్లు అతికించి ఉండటం చూసిన ఖాకీలు కంగుతిన్నారు. అయితే, ఈ కారు చోరీకి గురైందిగా తెలిసింది. ఇంతకీ ఆ పోస్టర్లలో ఏముందంటే..
రాజస్థాన్లోని బికనీర్లోని నపసర్ పట్టణంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఒక పాడుబడిన స్కార్పియో కారును పోలీసులు గుర్తించారు. దానికి నంబర్ ప్లేట్ లేదు. ఈ కారుపై మూడు పోస్టర్లు అతికించి ఉండటం కనిపించింది. ఈ పోస్టర్లపై కారు యజమాని క్లూ కూడా రాసి ఉంది. కారు స్వాధీనం చేసుకున్న తర్వాత రాజస్థాన్ పోలీసులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. కారుపై నెంబర్, మెసేజ్ రాసి ఉన్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాజస్థాన్లో స్వాధీనం చేసుకున్న కారుపై ఇలా రాసి ఉంది.. క్షమించండి..ఈ కారు ఢిల్లీలోని పాలం నుండి దొంగిలించబడింది. కారు నంబర్ “DL 9 CA Z2937” అని కూడా నోట్పై రాసి ఉంది. కారు నంబరు ఉండడంతో ఆ కారు ఎక్కడిది..? ఎవరిది అనే విషయాన్ని గుర్తించడం పోలీసులకు సులువైంది. ఐ లవ్ మై ఇండియా అని మరో నోట్లో రాసింది. ఇక, విండ్స్క్రీన్పై రాసిన మూడో నోట్లో ఈ కారు ఢిల్లీ నుంచి దొంగిలించబడిందని రాసి ఉంది. దయచేసి పోలీసులకు కాల్ చేసి వారికి తెలియజేయండి.
बीकानेर में चोरी की गाड़ी हाईवे पर छोड़ बोला “सॉरी” अज्ञात चोरों ने दिल्ली से चुराई थी एक स्कॉर्पियो गाड़ी के शीशे पर कागज़ चिपकाकर लिखा सॉरी दिल्ली के पालम से चुराई हुई है स्कॉर्पियो गाड़ी pic.twitter.com/y1X9KU1Q8b
— Journalist Ashutosh (@Zee1Ashutosh) October 14, 2024
అందిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు పాలం కాలనీలో నివసిస్తున్న కారు యజమాని విచారించారు. నిజంగానే తన కారు మాయమైనట్లు యజమాని అప్పటికే ఫిర్యాదు చేశాడు. ఈ కారు చోరీకి గురైన తర్వాత ఏదైనా నేరానికి వినియోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి రాజస్థాన్ పోలీసులు మాట్లాడుతూ, కారు యజమానితో ఢిల్లీ పోలీసులు రాజస్థాన్ వస్తున్నారని చెప్పారు. ఢిల్లీ పోలీసులు 450 కిలోమీటర్ల దూరంలోని బికనీర్కు చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో ఆ వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ హోటల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..