మరోసారి ‘సూపర్’ కాంబో !
త్వరలో సూపర్ కాంబో తెరకెక్కనున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. కింగ్ నాగార్జున, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుందని సమాచారం.
త్వరలో సూపర్ కాంబో తెరకెక్కనున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. కింగ్ నాగార్జున, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్ నాగార్జునకు బాగా నచ్చడంతో ఆయన పచ్చజెండా ఊపినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పూరి, విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ లాక్డౌన్ సమయంలో దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్పై పూరి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త జోష్ తెచ్చింది. గతంలో పూరి-నాగ్..’సూపర్’, ‘శివమణి’ సినిమాల కోసం కలిసి పనిచేశారు.
అక్కినేని నాగార్జున ప్రజంట్ ‘బిగ్బాస్ 4’ రియాల్టీ షో షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రొమో ఇటీవలే రిలీజై.. ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ అందుకుంది. ఈ నెలాఖరు నుంచి ఈ రియాల్టీ షో ప్రసారం కానుంది. కాగా ప్రజంట్ పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తుండగా.. పూరీ జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహర్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read :
వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !
గోమాతకు గాయం, హెలికాప్టర్ ద్వారా తరలించిన