Hyderabad: థెరపిస్టులం అంటూ ఇంటి లోపలికి తీసుకెళ్లిన మహిళలు.. కట్ చేస్తే..

థెరపిస్ట్ అంటూ పరిచయమయ్యారు.. ఇంకెముంది మనోడు.. పొంగిపోయాడు.. వాళ్లు లోకేషన్ షేర్ చేయ్యగానే రయ్యిరయ్యిన వెళ్లాడు.. చివరకు ఆ లేడీలు.. మసాజ్ పేరుతో న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టారు. తీరా ఏం చేయలేక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.. బాధితుడు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

Hyderabad: థెరపిస్టులం అంటూ ఇంటి లోపలికి తీసుకెళ్లిన మహిళలు.. కట్ చేస్తే..
Crime News
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 30, 2024 | 8:43 PM

థెరపిస్ట్ అంటూ పరిచయమయ్యారు.. ఇంకెముంది మనోడు.. పొంగిపోయాడు.. వాళ్లు లోకేషన్ షేర్ చేయ్యగానే రయ్యిరయ్యిన వెళ్లాడు.. చివరకు ఆ లేడీలు.. మసాజ్ పేరుతో న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టారు. తీరా ఏం చేయలేక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.. బాధితుడు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో స్పా థెరపిస్ట్‌లుగా వేషధారణలో ఉన్న ఇద్దరు మహిళలు.. ఓ వ్యక్తి బెదిరించి అసభ్యకరమైన ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చవ్వా సతీష్ కుమార్ (54) కి రాణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె కుమార్ ను థెరపిస్టుగా పరిచయం చేసుకుంది. ఆ తర్వాత కుమార్‌కు మొబైల్ నంబర్ ఇచ్చింది. ఫోన్లో పరిచయం పెంచుకొని వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి అది అనిత (అసలు పేరు రాజలక్ష్మి) అని పిలువబడే రాజలక్ష్మి అనే వేరే థెరపిస్ట్ చెందినదని పేర్కొంది. దీంతో 54 ఏళ్ల కుమార్ రాజలక్ష్మిని సంప్రదించాడు.. బెస్ట్ మసాజ్ సర్వీస్ అందిస్తామని ఆమె లొకేషన్‌ను షేర్ చేసింది. ఇంకెముంది కుమార్ భరత్‌నగర్‌లో ఉన్న ఆ ఇంటి లొకేషన్‌కి వెళ్లాడు. అక్కడ రాజ్యలక్ష్మి, గీత, రజిని అనే ముగ్గురు మహిళలు కుమార్ ను ఇంటిలోపలికి తీసుకెళ్లారు.

అయితే, మసాజ్ సెంటర్ లోపలికి వెళ్ళిన కుమార్.. అది స్పా కాదని గ్రహించి అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళలు అతనిని బలవంతంగా అడ్డుకుని.. సినిమాల్లో లాగా బెదిరించారు. అనంతరం దుస్తులు విప్పేసి ఫోటోలు తీసి కుమార్ ని బెదిరించారు. ఆ తర్వాత కుమార్ ను ఎలాగొలా అక్కడినుంచి బయటపడ్డాడు..

అనంతరం గీత కుమార్‌ కి ఫోన్ చేసి రూ.20,000 ఇవ్వకుంటే న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించింది. ఏం చేయాలో అర్థం కాక భయపడిన కుమార్ ఆ మొత్తాన్ని చెల్లించాడు. కొద్దిసేపటికే రాజలక్ష్మి కుమార్ కు ఫోన్ చేసి.. 30 లక్షలు చెల్లించకపోతే ఫోటోలు, వీడియోలను అతని కుటుంబంతో, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది.

దీంతో భయపడిన కుమార్ మొదట 30 లక్షలు ఇస్తానని ఒప్పుకొని వెంటనే పోలీసులు ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన సనత్ నగర్ పోలీసులు.. మహిళల్ని అరెస్టు చేసి భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 342 (తప్పుగా నిర్బంధించడం), 384 (దోపిడీ), 506 (నేరపూరిత బెదిరింపు) r/w 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
వ్యాక్సిన్లపై సంచలనం రేపుతున్న పరిశోధనలు!
వ్యాక్సిన్లపై సంచలనం రేపుతున్న పరిశోధనలు!
యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం కదిలిన టీవీ 9 నెట్‌వర్క్..
యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం కదిలిన టీవీ 9 నెట్‌వర్క్..
ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో
ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో