
పైరసీ కింగ్పిన్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కస్టడీ విచారణ పూర్తయింది. ఇమంది రవి పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు కీలక వివరాలను సేకరించారు. పైరసీ ముఠాలతో లింకులు, పైరసీ మూలాలు, బెట్టింగ్ యాప్స్, ఆర్థిక లావాదేవీలపై మరిన్ని ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా.. ప్రహ్లాద్ వెల్లేల పేరిట రవి పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో.. హైదరాబాద్ పోలీసులు అతని పాత్రపై కూడా నిగ్గు తేల్చారు.. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ను పిలిపించి విచారించారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్ను పోలీసులు ప్రశ్నించి పలు వివరాలు సేకరించారు. అయితే.. 12 రోజులపాటు రవిని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నేటితో కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపర్చారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు రవిని తరలించారు. ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున.. మూడు కేసుల్లో 12 రోజులపాటు పోలీసులు విచారించారు.
కాగా.. పైరసీ కేసులో అరెస్ట్ అయినా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి తీరు మారలేదు.. అంతా చేసి.. అన్నీ ఫాల్స్ అంటూ పేర్కొన్నాడు.. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానంటూ ప్రగల్భాలు పలికాడు.. మీడియాపై యాటిట్యూట్ చూపించిన ఇమంది రవి.. సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతానంటూ కోర్టు ఆవరణలో పేర్కొన్నాడు.. ఈ సందర్భంగా ఐబొమ్మ రవి టీవీ9 తోమాట్లాడాడు.. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. బెట్టింగ్ యాప్స్తో సంబంధాలున్నాయని ఎవరు చెప్పారంటూ పేర్కొన్నాడు.. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా అంటూ టీవీ9తో ఐ బొమ్మ రవి పేర్కొన్నాడు.. తనపేరు ఐ బొమ్మ రవి కాదని.. పోలీసులు చెబితే నేరం చేసినట్టా..? అంటూ పేర్కొన్నాడు. తాను ఎక్కడికీ పారిపోలేదు..కూకట్పల్లిలోనే ఉన్నాని.. వేరే దేశంలో సిటిజన్షిప్ మాత్రమే తీసుకున్నా అంటూ ఐబొమ్మ రవి పేర్కొన్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..