Hyderabad: చదివింది టెన్త్‌ క్లాస్‌.. నడిపేది సరోగసీ సెంటర్‌.. మతిపోతున్న షాకింగ్‌ విషయాలు!

మేడ్చల్ సరోగసి కేసులో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. లక్ష్మిపై BNS 318(4),61(2) యాక్ట్‌ కింద రెండు కేసులు, ART యాక్ట్ కింద మరో రెండు కేసులు, సరోగసీ యాక్ట్ కింద ఇంకో 4 కేసుల నమోదు చేశారు పోలీసులు. ఆగస్టు 14న పక్కా సమాచారంతో సరోగసి జరుగుతున్న ఓ ఇంట్లో సోదాలు చేసినట్లు వెల్లడించారు. సోమవారం(ఆగస్టు 18) మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటీషన్‌ దాఖలు చేయనున్నారు.

Hyderabad: చదివింది టెన్త్‌ క్లాస్‌.. నడిపేది సరోగసీ సెంటర్‌.. మతిపోతున్న షాకింగ్‌ విషయాలు!
Medchal Surrogacy

Updated on: Aug 18, 2025 | 8:07 AM

చదివింది 10th క్లాస్‌. పదిసార్లు తానే ఎగ్‌ డొనేట్‌ చేసింది. రెండు సార్లు సరోగసీ మదర్‌ అవతారం ఎత్తింది. అద్దె గర్భం దాల్చి బిడ్డలకు జన్మనిచ్చి, ఒరిజినల్‌ పేరెంట్స్‌ చేతుల్లో పెట్టింది. ఈ కష్టాలన్నీ ఎందుకు అనుకుందో ఏమో తానే సొంత దుకాణం పెట్టింది. ఫెర్టిలిటీ సెంటర్లకు ఎగ్‌ డోనర్లను సప్లయ్ చేయడం, గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళలను కూడా తానే సప్లయ్‌ చేయడం మొదలుపెట్టింది. మేడ్చల్‌లో ఈ ఇల్లీగల్‌ దందాను కుటీర పరిశ్రమలా నడుపుతున్న లక్ష్మీ కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మేడ్చల్ సరోగసి కేసులో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. లక్ష్మిపై BNS 318(4),61(2) యాక్ట్‌ కింద రెండు కేసులు, ART యాక్ట్ కింద మరో రెండు కేసులు, సరోగసీ యాక్ట్ కింద ఇంకో 4 కేసుల నమోదు చేశారు పోలీసులు. ఆగస్టు 14న పక్కా సమాచారంతో సరోగసి జరుగుతున్న ఓ ఇంట్లో సోదాలు చేసినట్లు వెల్లడించారు. సోదాల సమయంలో సరోగెంట్ తల్లులతోపాటు వివిధ ఫెర్టిలిటీ హాస్పిటల్స్‌కు చెందిన డాక్యుమెంట్స్‌ని గుర్తించినట్లు FIRలో పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సూత్రధారి లక్ష్మితోపాటు ఆమె కొడుకును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

టీవీ9 చేతికొచ్చిన FIRలో విస్తుపోయే విషయాలున్నాయి. మొదట్లో నిందితురాలు లక్ష్మీ ఏజెంట్‌గా పనిచేసినట్లు FIRలో పేర్కొన్నారు పోలీసులు. మొదట్లో తానే ఎగ్‌ డొనేట్‌ చేసేది. సరోగేట్‌ మదర్‌ అవతారం కూడా ఎత్తింది. భారీగా డబ్బు సంపాదించాలంటే ఇలా లాభం లేదనుకుని, మేడ్చల్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, అందులో తన సొంత దుకాణం షురూ చేసింది. LLH ఫెర్టిలిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌ పేరుతో ఫెర్టిలిటీ సెంటర్లతో తనకు ఉన్న కాంటాక్ట్స్‌ను ఉపయోగించుకుని, వాళ్లకు ఎగ్‌ డొనేట్‌ చేసే మహిళలను సమకూర్చేది. అలాగే జంటలకు, ఫెర్టిలిటీ క్లినిక్స్‌కు సరోగేట్‌ మదర్స్‌ను కూడా అందుబాటులో ఉంచేది. అటు ఫెర్టిలిటీ సెంటర్ల దగ్గర కమిషన్‌ తీసుకునేది. ఇటు పిల్లల కోసం తహతహలాడే జంటల నుంచి భారీగా డబ్బు గుంజేదని FIRలో పేర్కొన్నారు పోలీసులు.

హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కింద ముంబైలో లక్ష్మిపై కేసు నమోదైంది. దీంతో కంపెనీని మూసేసి, పర్సనల్‌ కాంటాక్టులతో ఈ దందాను గుట్టుచప్పుడు కాకుండా నడపడం మొదలుపెట్టింది లక్ష్మి. నిందితురాలు లక్ష్మికి 1994లో వివాహం అయింది. వ్యక్తిగత కారణాలతో భర్తకు దూరంగా ఉంటూ.. కొడుకు కూతురితో కలిసి ఉంటోంది ఆమె. కొడుకుతో కలిసి ఫెర్టిలిటీ సెంటర్లకు ఏజెంట్‌గా అవతారం ఎత్తింది లక్ష్మి. ఆ తర్వాత ఈ ఇల్లీగల్ దందా కోసం కంపెనీనే తెరిచింది.

ఇక ఎగ్‌ డోనర్లను పంపిస్తే రూ. 40 వేల కమీషన్‌..! సరోగేట్‌ మదర్‌కు రూ. 60 వేల కమీషన్‌ ఇచ్చే లక్ష్మీ.. జంటల నుంచి భారీగానే వసూలు చేసింది. అలాగే ఇప్పటివరకు 50మందికి పైగా సరోగసీ చేయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పలు ఫెర్టిలిటీ సెంటర్లతో కలిసి లక్ష్మి దందా చేస్తుండటంతో.. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్‌, అను టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌, ఫెర్టీ కేర్‌, EVA IVF, అమూల్య IVF, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లకు పోలీసుల నోటీసులు జారీ చేశారు.

ఈ కేసులో మరికొందరిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటున్నారు మేడ్చల్‌ జిల్లా పోలీసులు. లక్ష్మిని కస్టడీకి కోరనున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. సోమవారం(ఆగస్టు 18) మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటీషన్‌ దాఖలు చేయనున్నారు. ఐదు రోజులపాటు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మిని కస్టడీకి తీసుకుని విచారిస్తే, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..