ఖమ్మం వేదికగా లక్షలాదిమంది ప్రజానీకం ముందు బీఆర్ఎస్ అజెండా, పాలసీలను వెల్లడించారు. పార్టీ సమగ్ర విధానం త్వరలోనే ఇస్తామన్న సీఎం కేసీఆర్ కోర్ అజెండా మాత్రం వెల్లడించారు. సంక్షేమం, జాతీయికరణ మా విధానం అని తేల్చేశారు. సమగ్రాభివృద్ధికి కావాల్సిన నివేదికలు, పాలసీలు రూపొందిస్తున్నామన్న సీఎం కేసీఆర్ దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేసి తీరుతామన్నారు. BJP, RSSల నుంచి ప్రజాస్వామ్యానికే కాదు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు లెఫ్ట్ పార్టీ నేతలు. మోదీని ఇంటికి పింపితేనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. 10 ఏళ్లు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా దేశ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని.. 2024లో ప్రజలు మరోసారి మార్పు కోసం ఎదురుచూస్తున్నారన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.