Telangana: మూడు కుటుంబాల్లో విషాదం నింపిన రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం..

జాతీయ రహదారిపై పొగమంచు ముగ్గురి ప్రాణాలు మింగేసింది.. వరంగల్- హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి పెంబర్తి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆరేళ్ళ పాపతో సహా ముగ్గురు మృతి చెందారు..

Telangana: మూడు కుటుంబాల్లో విషాదం నింపిన రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం..
Accident
Follow us

|

Updated on: Feb 07, 2023 | 12:14 PM

జాతీయ రహదారిపై పొగమంచు ముగ్గురి ప్రాణాలు మింగేసింది.. వరంగల్- హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి పెంబర్తి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆరేళ్ళ పాపతో సహా ముగ్గురు మృతి చెందారు.. ఈ ప్రమాదం మూడు కుటుంబాల్లో ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం హైదరాబాద్‌ – వరంగల్‌ జాతీయ రహదారిపై జనగాం జిల్లాలోని పెంబర్తిలో ఆగివున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. అంతే.. కారు తిరగబడి.. ఎగిరి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులలో శ్రీహిక అనే ఆరేళ్ల పాప ఉంది.. డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు.

హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన దేవేందర్ రెడ్డి, శ్రావణి దంపతులు పాపతో శుక్రవారం తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కాజిపేటలో రైలు దిగి కారులో కొండాపూర్ కు బయలుదేరారు. హైదరాబాద్ వస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు దేవేందర్ రెడ్డి, శ్రావణికి గాయాలవ్వగా.. చిన్నారి శ్రీహిక ప్రాణాలు కోల్పోయింది. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా బోరున విలపిస్తున్నారు. బేగంపేట్‌లో ఓ ప్రైవేట్ బ్యాంకులో దేవేందర్ రెడ్డి మేనేజర్‌గా పని చేస్తున్నారు.

దేవేందర్ రెడ్డి, శ్రావణికి తీవ్రగాయాలు కావడంతో వారిని జనగామ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన డ్రైవర్ అబ్దుల్ రహీమ్ గా, క్లీనర్ తిరుమలగిరి గ్రామానికి చెందిన రాజశేఖర్ గా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Latest Articles