ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త ..సంక్రాంతికి సమ్మె జీతం..

ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మె చేసిన 55 రోజులుకు గానూ జీతం ఇవ్వాలని నిర్ణయించింది. సంక్రాంతికి నాలుగు రోజుల ముందు అనగా ఈ నెల 11న ఉద్యోగుల ఖాతాల్లో 55 రోజుల వేతనాన్ని వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీసీ వెల్ఫేర్ బోర్టులో  202 మంది సభ్యులను నియమిస్తూ సర్కులర్ జారీ చేశారు. ప్రతి డిపో నుంచి సభ్యుడు ప్రాతినిథ్యం వహించేలా నియామకాలు జరిగాయి. రీజియన్ మేనేజర్లు సదరు సభ్యులను నామినేట్ చేశారు. […]

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త ..సంక్రాంతికి సమ్మె జీతం..
Follow us

|

Updated on: Jan 08, 2020 | 9:22 AM

ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మె చేసిన 55 రోజులుకు గానూ జీతం ఇవ్వాలని నిర్ణయించింది. సంక్రాంతికి నాలుగు రోజుల ముందు అనగా ఈ నెల 11న ఉద్యోగుల ఖాతాల్లో 55 రోజుల వేతనాన్ని వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీసీ వెల్ఫేర్ బోర్టులో  202 మంది సభ్యులను నియమిస్తూ సర్కులర్ జారీ చేశారు. ప్రతి డిపో నుంచి సభ్యుడు ప్రాతినిథ్యం వహించేలా నియామకాలు జరిగాయి. రీజియన్ మేనేజర్లు సదరు సభ్యులను నామినేట్ చేశారు. వీరు ఆ డిపో పరిధిలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా పనిచేయనున్నారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన అద్దె బస్సుల బకాయిలను చెల్లించింది యాజమాన్యం. మూడు నెలలుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో, బస్సులను నిలిపివేస్తామని అద్దె బస్సుల ఓనర్లు ఈడీకి లేఖ రాశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు రూ. 20 కోట్లు రిలీజ్ చేసింది ఆర్టీసీ యాజమాన్యం.