
నేడు చాలా మంది మొబైల్ వినియోగదారులు రీఛార్జ్ల కోసం Google Pay, PhonePe, UPI అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు. ఇలా రీఛార్జ్ చేసినప్పుడు సాధారణంగా రూ.3 అదనపు ఖర్చు అవుతుంది. అయితే రూ.50 కంటే తక్కువ రీఛార్జ్లకు అదనపు ఛార్జీలు ఉండవు. అదనపు డబ్బు చెల్లించకుండానే ఈ విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. అదనపు డబ్బు చెల్లించకుండా మీ జియో-ఎయిర్టెల్ సిమ్ను ఎలా రీఛార్జ్ చేయాలో తెలుసుకుందాం.
భారతదేశంలో గూగుల్ పే, ఫోన్పే ప్రసిద్ధ ఆన్లైన్ చెల్లింపు యాప్లు. అవి వినియోగదారులు తమ యుటిలిటీ బిల్లులను సౌకర్యవంతంగా చెల్లించడానికి, ఇతర ఆన్లైన్ లావాదేవీలను నిర్వహించడానికి అనుమతిస్తాయి. గూగుల్ పే, ఫోన్పే వంటి ఆన్లైన్ చెల్లింపు సేవలు ఒకప్పుడు మొబైల్ ఫోన్ రీఛార్జ్లపై క్యాష్బ్యాక్లను అందించేవి. తద్వారా వినియోగదారులు వాటిని తరచుగా ఉపయోగించుకునేలా ఆకర్షితులవుతున్నాయి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల నుండి బిల్లు చెల్లింపులు, మొబైల్ నంబర్ రీఛార్జ్లు, ఇతర సేవలకు అధిక రుసుములు వసూలు చేస్తున్నాయి. ఈ రుసుములో GST కూడా ఉంటుంది.
అదనంగా కొన్ని డిజిటల్ వాలెట్లు జియో రీఛార్జ్లపై క్యాష్బ్యాక్ లేదా డిస్కౌంట్లను కూడా అందిస్తాయి. మీరు Paytm లేదా Amazon Pay వంటి వాలెట్లలో ఆఫర్ల విభాగాన్ని తనిఖీ చేయవచ్చు. ఈ ఆఫర్లను ఉపయోగించడం ద్వారా మీరు కొంత రుసుములను తగ్గించవచ్చు లేదా నివారించవచ్చు.
ఇది కూడా చదవండి: IRCTC: ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం.. తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త నిబంధనలు.. ఇప్పుడు మరింత సులభం
మరొక పద్ధతి ఏమిటంటే జియో వినియోగదారులు అధికారిక జియో వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి. jio.com ని సందర్శించి రీఛార్జ్ విభాగానికి వెళ్లండి. మీ జియో నంబర్ ఉపయోగించి లాగిన్ అయి ఏదైనా ప్లాన్ ఎంచుకోండి. ఇప్పుడు చెల్లింపు పేజీకి వెళ్లి నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ చెల్లింపును ఉపయోగించి అదనపు డబ్బు చెల్లించకుండా రీఛార్జ్ను పూర్తి చేయండి.
ఇది కూడా చదవండి: Gold Price: వామ్మో.. సామాన్యులకు కష్టమే..11,000 పెరిగిన బంగారం ధర.. లక్ష దాటనుందా..?
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి