
ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ను ఉపయోగించిన తర్వాత దాన్ని షట్డౌన్ చేయకుండా కొంతమంది అలాగే ఆన్లోనే ఉంచేస్తూ ఉంటారు. కొందరు పదే పదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల యంత్రంపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతారు. మరోవైపు ఎప్పుడూ ఆన్లో ఉంచితే హార్డ్వేర్ త్వరగా అరిగిపోతుందని మరికొందరు భావిస్తారు. అయితే నిజంగా ఏది మంచిదో నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు.
నిపుణుల ప్రకారం రోజుకు కనీసం ఒకసారి షట్డౌన్ లేదా రీస్టార్ట్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల కాష్ మెమరీ క్లియర్ అవుతుంది, సిస్టమ్ పనితీరు మెరుగుపడుతుంది. మీరు రోజంతా ల్యాప్టాప్ను ఉపయోగిస్తుంటే, పూర్తిగా ఆఫ్ చేయకుండా Sleep లేదా Hibernate మోడ్ ఉపయోగించవచ్చు. మీరు ఆఫీస్ పని కోసం మాత్రమే ఉపయోగిస్తే, పని పూర్తయ్యాక షట్డౌన్ చేయడం ఉత్తమం. వారానికి కనీసం ఒకసారి రీస్టార్ట్ చేయడం తప్పనిసరి. మొత్తానికి, కంప్యూటర్ను ఎప్పటికీ ఆన్లో ఉంచడం కంటే సరైన సమయంలో షట్డౌన్ చేయడం లేదా స్లీప్ మోడ్ ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీ ల్యాప్టాప్ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది, హార్డ్వేర్ జీవితకాలం కూడా పెరుగుతుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి