ఆ మ్యాచ్ టీమిండియా కావాలనే ఓడిపోయింది..!
2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ వెర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా కావాలనే ఓడిపోయిందని పాక్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ వెల్లడించారు. భారత్తో జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ బెన్ స్టోక్స్ తన ‘ఆన్పైర్’ పుస్తకంలో పలు విషయాలను ప్రస్తావించగా.. అది ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. దీనిపై వరుసగా పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న పాకిస్తాన్ మాజీ బౌలర్ సికిందర్ బక్త్ టీమిండియాపై ఆరోపణలు చేయగా… తాజాగా రజాక్ కూడా […]
2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ వెర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా కావాలనే ఓడిపోయిందని పాక్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ వెల్లడించారు. భారత్తో జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ బెన్ స్టోక్స్ తన ‘ఆన్పైర్’ పుస్తకంలో పలు విషయాలను ప్రస్తావించగా.. అది ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది.
దీనిపై వరుసగా పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న పాకిస్తాన్ మాజీ బౌలర్ సికిందర్ బక్త్ టీమిండియాపై ఆరోపణలు చేయగా… తాజాగా రజాక్ కూడా ఇదే వరుసలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లలో వరుసగా విజయాలు సాధించిన జట్టు.. ఇంగ్లాండ్పై ఎందుకు ఓడిపోయింది.? వరల్డ్ బెస్ట్ బౌలర్.. ఎందుకు ఈ మ్యాచ్లోనే లయ తప్పి పరుగులు సమర్పించుకున్నాడు. ఫోర్లు, సిక్స్లు కొట్టాల్సిన సమయంలో ఎందుకు డిఫెన్సు ఆడారు.? ఇవన్నీ కూడా ఒక జట్టును క్వాలిఫై కాకుండా చేసేందుకే భారత్ చేసిందని.. అందుకే ఆ మ్యాచ్ ఓడిపోయిందని రజాక్ విమర్శించాడు.
అటు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. పాకిస్తాన్ నాకౌట్కు చేరకుండా ఉండేందుకే భారత్ ఆ మ్యాచ్ ఓడిపోయినట్లు తనకు జేసన్ హోల్డర్, క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్ లాంటి విండీస్ క్రికెటర్లు చెప్పారని ముస్తాక్ అహ్మద్ వివరించాడు. వన్డే వరల్డ్కప్లో తాను విండీస్ క్రికెట్తో పని చేసినప్పుడు వారు ఈ విషయాన్ని వెల్లడించారని చెప్పాడు. ఏది ఏమైనా పాకిస్తాన్ క్రికెటర్లకు భారత్ ఆటగాళ్ళపై తన అక్కసును వెళ్లబుచ్చుకోవడం ఇదేం కొత్త కాదు.
Also Read:
నార్త్ కొరియాలో యుద్ధ మేఘాలు.. కిమ్ ఆదేశమే లేటు..!
ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..
వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..