తమిళనాడులో కొత్తగా మరో 5,860 పాజిటివ్‌ కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఐదువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా..

తమిళనాడులో కొత్తగా మరో 5,860 పాజిటివ్‌ కేసులు
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 7:50 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఐదువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,860 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,32,105కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 2,72,251 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 54,213 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలావుంటే.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 5,641 మంది మరణించారు. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి.

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు

ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ మృతి