తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే దేశంలో..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో తమిళనాడు ఉంది.
తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 3,680 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,261కి చేరింది. వీటిలో ప్రస్తుతం 46,105 యాక్టివ్ కేసులు ఉన్నాయని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 82,324 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 64 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,829 మంది మరణించారు.
ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74 వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 1,205 చెన్నై నగరంలోనే నమోదయ్యాయి.
Tamil Nadu reports 3,680 new #COVID19 positive cases and 64 deaths today, taking the total number of positive cases to 1,30,261 including 46,105 active, 82,324 discharges and 1,829 deaths: National Health Mission, TamilNadu
— ANI (@ANI) July 10, 2020