చేయాల్సిందెంతో వుంది మోదీ జీ.. !!

స్వచ్ఛభారత్ కానీ.. బహిరంగ మల,మూత్ర విసర్జన లేని దేశంగా మార్చాలన్న సంకల్పం కానీ ఏ మాత్రం విమర్శించదగినవి కాదు. అలాగని ఎంతో కొంత చేసి.. అంతా అయిపోయిందని చాటుకునేంత చిన్న లక్ష్యాలు ఎంత మాత్రం కాదు. సువిశాల భారత దేశంలో ఈ రెండు లక్ష్యాలు 4,5 ఏళ్ళలో సాధించే లక్ష్యాలు ఎంత మాత్రం కావు. కానీ.. మొన్నటికి మొన్న మొత్తం భారత దేశమంతటా బహిరంగ మల విసర్జన మచ్చుకైనా లేకుండా చేయగలిగామని ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లో 20,000 […]

చేయాల్సిందెంతో వుంది మోదీ జీ.. !!
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 4:47 PM

స్వచ్ఛభారత్ కానీ.. బహిరంగ మల,మూత్ర విసర్జన లేని దేశంగా మార్చాలన్న సంకల్పం కానీ ఏ మాత్రం విమర్శించదగినవి కాదు. అలాగని ఎంతో కొంత చేసి.. అంతా అయిపోయిందని చాటుకునేంత చిన్న లక్ష్యాలు ఎంత మాత్రం కాదు. సువిశాల భారత దేశంలో ఈ రెండు లక్ష్యాలు 4,5 ఏళ్ళలో సాధించే లక్ష్యాలు ఎంత మాత్రం కావు. కానీ.. మొన్నటికి మొన్న మొత్తం భారత దేశమంతటా బహిరంగ మల విసర్జన మచ్చుకైనా లేకుండా చేయగలిగామని ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లో 20,000 మంది గ్రామ పెద్దల సమక్షంలో చేసిన ప్రకటన కలా, నిజామా అనే సందిగ్ధ స్థితిలో పడేసింది. పేదరికానికి నిలయమై.. అత్యధిక జనాభా గల సువిశాల భారత దేశంలో ఈ లక్షాన్ని సాధించగలగడం అనుకునేంత సులువైంది కాదు. కాని దానినొక దీక్షగా చేపట్టి అమల్లోకి తీసుకు రావడానికి ప్రధాని మోడీ సంకల్పం చెప్పుకున్న తీరు గణనీయమైనది. స్వచ్ఛ భారత్ పేరిట ఆయన ఇందు కోసం చేసిన ప్రచారం సాధారణమైనది కాదు, ఇంత వరకు దేశంలోని ఏ నేతా ఈ పని చేయలేదనడం అతిశయోక్తి కానేరదు. పారిశుద్ధానికి మహాత్మా గాంధీ ఇచ్చిన ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. దాదాపు అదే స్థాయిలో మోదీ ప్రచారం చేసుకున్నారు.

ఆయన స్వచ్ఛ భారత్ స్వప్నాన్ని పరిపూర్ణంగా సాధించగలిగామని ఈ కార్యక్రమం చేపట్టి ఐదేళ్లు నిండిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించుకున్నారు. ప్రధాని చెప్పిన దానిని బట్టి గత 60 మాసాల్లో 60 కోట్ల మందికి ఆధునిక మరుగు దొడ్ల సదుపాయాన్ని కలిగించారు, దేశ వ్యాప్తంగా 11 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతుంది. మరుగు దొడ్ల సౌకర్యాన్ని కల్పించడం, బహిరంగ మల విసర్జనను అంతమొందించడం ఒకటేనని భావించమంటున్నారు ప్రధాని మోడీ. కాని రెండింటికీ మధ్య గల తేడా గురించి వివరించి చెప్పనక్కర లేదు. సగానికి పైగా బడుగు, బలహీన వర్గాల ప్రజలున్న దేశంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన అలవాటు చిరకాలంగా స్థిరపడిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అది సర్వసాధారణమైపోయింది. ఈ విషయంలో మహిళలు ఇప్పటికీ అత్యంత అసౌకర్యాన్ని అభద్రతాయుత వాతావరణాన్ని భరించాల్సి వస్తుంది.

బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో, వారి హాస్టళ్లల్లో బాలికలకు సరైన మరుగు దొడ్లు లేని దయనీయ పరిస్థితి కొనసాగుతున్నది. అవసరం తీర్చుకోడానికి బయటికి వెళ్లి పురుగు, పుట్రా కాటుకు దొరికిపోడం, దుండగుల అపహరణకు గురవడం కూడా జరుగుతున్నది. అలాగే తల దాచుకోను గట్టి గూడు లేక గుడిసెల్లో బతికే జనాభాకు దేశంలో కొదువ లేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆధునిక మరుగు దొడ్లను అందుబాటులోకి తెచ్చామని ప్రకటించడం దుస్సాహసమే అవుతుంది. స్వయంగా ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారు కాబట్టి అది అందరి దృష్టినీ తప్పని సరిగా ఆకర్షిస్తుంది. మరుగు దొడ్లు నిర్మించి ఇచ్చినంత మాత్రాన అయిపోయే వ్యవహారం కాదిది. వాటిల్లో తగిన నీటి సౌకర్యం ఉండాలి. విద్యుత్తు ఉండాలి. వాటికి తగిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కావాలి. మరుగు దొడ్లను ఇతరత్రా అవసరాలకు వాడకుండా తప్పని సరిగా మల విసర్జనకే వినియోగించుకునేలా ఆ ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించాలి.

2017లోనే బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా ప్రకటించుకున్న హర్యానాలో ప్రజలు మళ్లీ ఆ పాత అలవాటుకే మళ్లిపోతున్నారని ఇటీవల జరిపిన ఒక సర్వే కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడించింది. అనేక మురికి వాడలకు నిలయమైన ముంబై వంటి మహానగరాల్లో బహిరంగ మల విసర్జన బందయిందనడం అతిశయోక్తే అవుతుందని పలువురు పెద్దలు ఎత్తి చూపిస్తున్నారు. అందుచేత బహిరంగ విసర్జన లేని దేశంగా ప్రకటించుకోడం సకల ప్రచారార్భాట సౌకర్యాలు గల ప్రభుత్వాలకు సుళువే గాని దానిని రుజువు పరుచుకోడం మాత్రం అంత అనాయాస వ్యవహారం కాదు. అది జన జీవన కఠోర వాస్తవాల అద్దంలో అబద్ధంగానే రుజువవుతుంది.

గత అయిదేళ్ళలో ప్రభుత్వాలు చేసిందానికంటే చెప్పుకున్నదే ఎక్కువ. ఈ విషయంలో ఒక్క కేంద్ర ప్రభుత్వాన్నే నిందించలేం. రాష్ట్రాలు తమ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేదంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు.. స్వచ్ఛ భారత్ ప్రారంభమైన తొలి నాళ్ళలో హైదరాబాద్ తొలి రెండేళ్ల బెటర్ పర్ఫార్మర్గా అవార్డులందుకుంది. ఆ తర్వాత నిర్లక్ష్యం ఆవహించినందువల్ల హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నడి రోడ్డు మీద చెత్త పేరుకుపోయి తెల్లవారితే ముక్కు మూసుకుని దాటాల్సిన దుస్థితి కనిపిస్తోంది. స్వచ్ఛ భారత్ కానీ.. బహిరంగ మల,మూత్ర విసర్జనారహిత సమాజాన్ని నిర్మించడం గానీ.. కేంద్ర, రాష్ట్రాల సమిష్టి బాధ్యత. అదే సమయంలో పౌరులు కూడా స్వచ్ఛందంగా ఇందుకు కట్టుబడిన నాడే సంకల్పం నెరవేరుతుంది. అంతే గానీ ఆర్భాటపు ప్రకటనలతో లాభం లేదని ఏలికలు గుర్తించాలి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు