సఫారీలతో ఫస్ట్ టెస్టు: అనూహ్యంగా పంత్​కు ఉద్వాసన.. గ్రౌండ్‌లోకి సాహా!

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్​లో సత్తాచాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. రేపు  విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్​ జరగనుంది. ప్రాక్టీస్​లో బిజీగా ఉన్న కోహ్లీసేన… సఫారీలపై గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జట్టులో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫైనల్ లిస్ట్‌లో  యువవికెట్ కీపర్​ రిషబ్​ పంత్​కు బదులుగా వృద్ధిమాన్​ సాహాకు అవకాశం లభించింది. దీనిపై తాజాగా స్పందించిన కోహ్లీ… మొదటి టెస్టులో సాహా ఆడతాడని స్పష్టం చేశాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​లో ఘోరంగా విఫలమయ్యాడు పంత్. […]

సఫారీలతో ఫస్ట్ టెస్టు: అనూహ్యంగా పంత్​కు ఉద్వాసన.. గ్రౌండ్‌లోకి సాహా!
Follow us

|

Updated on: Oct 01, 2019 | 2:10 PM

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్​లో సత్తాచాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. రేపు  విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్​ జరగనుంది. ప్రాక్టీస్​లో బిజీగా ఉన్న కోహ్లీసేన… సఫారీలపై గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జట్టులో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫైనల్ లిస్ట్‌లో  యువవికెట్ కీపర్​ రిషబ్​ పంత్​కు బదులుగా వృద్ధిమాన్​ సాహాకు అవకాశం లభించింది. దీనిపై తాజాగా స్పందించిన కోహ్లీ… మొదటి టెస్టులో సాహా ఆడతాడని స్పష్టం చేశాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​లో ఘోరంగా విఫలమయ్యాడు పంత్. రెండు మ్యాచ్​ల్లో వరుసగా 4, 19 పరుగులు చేసి అందరిని డిసప్పాయింట్ చేశాడు. గత నెలలో జరిగిన వెస్టిండీస్​ టెస్టు సిరీస్​లోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. కాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అవసరం ఉన్న నేపథ్యంలో జడేజా, అశ్విన్​లు మొదటి టెస్టులో బరిలోకి దిగుతారని కోహ్లీ తెలిపాడు. స్టార్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ ఓపెనర్​గా ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని అన్నాడు.

ఫైనల్ జట్టు వివరాలు: 

విరాట్​ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైప్ కెప్టెన్), చటేశ్వర్​ పుజారా, రోహిత్​ శర్మ, మయాంక్​ అగర్వాల్​, హనుమ విహారి, ​ అశ్విన్​, ఆర్​ జడేజా, వృద్ధిమాన్​ సాహా(కీపర్​), ఇషాంత్​ శర్మ, మహ్మద్​ షమి