టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఆడింది కేవలం 41 మ్యాచ్లే.. అయినప్పటికీ ర్యాంకింగ్లో అగ్రస్థానం చేరుకున్నాడు. నిన్న న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో స్కై 51 బంతుల్లో 111 పరుగులు సాధించి అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. స్కైకి ఇది రెండో టీ20 శతకం కాగా.. దీనితో అతడు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
కాగా, ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి ఉంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ సెంచరీతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో భాగంగా బరిలోకి దిగిన కివీస్.. దీపక్ హుడా(4/10), చాహల్(2/26), సిరాజ్(2/24), సుందర్(1/24), భువనేశ్వర్(1/12) ధాటికి 18.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై పరాజయాన్ని చవిచూసింది.