
భారత క్రికెట్కు మరోసారి గర్వకారణమైన ఘట్టం ఎదురైంది. ఈసారి కొత్త రూపంలో 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ తిరిగి క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన రాబోయే T20 ముంబై లీగ్ 2025 సీజన్ కోసం సోబో ముంబై ఫాల్కన్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. టోర్నమెంట్ ప్రారంభానికి కొన్ని వారాల ముందే ఈ ప్రకటన అధికారికంగా వెలువడింది. ప్రపంచ క్రికెట్లో గొప్ప ఆల్రౌండర్లలో ఒకరిగా పేరు పొందిన కపిల్ దేవ్, ఇప్పుడు తన అనుభవాన్ని, ప్రభావాన్ని ముంబై క్రికెట్కు అందించబోతున్నారు.
ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ, “సోబో ముంబై ఫాల్కన్స్ తమ తొలి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారితో కలిసి ఉండటం నాకు గౌరవంగా ఉంది” అంటూ భావోద్వేగంగా స్పందించారు. సోబో ముంబై ఫాల్కన్స్ యజమాని అమీత్ హెచ్ గధోక్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, కపిల్ దేవ్ జట్టులో చేరటం వల్ల వారి జట్టుకు గొప్ప ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. “అతని అద్భుతమైన వారసత్వం, అపారమైన అనుభవం జట్టుకు మార్గనిర్దేశక శక్తిగా మారుతాయి” అని పేర్కొన్నారు.
T20 ముంబై లీగ్ మూడవ ఎడిషన్ ఈ నెల మే 26 నుంచి ప్రారంభమై జూన్ 8 వరకు ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నమెంట్లో ఎనిమిది జట్లు మొత్తం 20 మ్యాచ్లలో తలపడనున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మను ఈ లీగ్కు బ్రాండ్ ఫేస్గా ఎంపిక చేయగా, సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్, శివం దుబే, పృథ్వీ షా వంటి భారత క్రికెట్ స్టార్ ప్లేయర్లు లీగ్ను మరింత రంజకంగా మార్చనున్నారు.
ఈ టోర్నమెంట్ మొత్తం జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరికీ ఇది ఒక క్రికెట్ పండుగగా మారనుంది. కపిల్ దేవ్ లాంటి దిగ్గజం మళ్లీ క్రికెట్కు దగ్గరయ్యారు అనడం సంతోషకరం. ఇది యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిచే అవకాశముంది.
The original game changer, the pride of Indian cricket Kapil Dev is now a part of the SoBo Mumbai Falcons family as our Brand Ambassador.
With his vision, passion, and unmatched legacy,
a new era begins in South Mumbai!
Welcome, Kapil Sir!#SoBoMumbaiFalcons pic.twitter.com/n3dIyEuZuC— SoBo Mumbai Falcons (@SoboMFRL) May 1, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..