ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో 14 మ్యాచ్లు పూర్తయ్యాయి. చాలా టీమ్స్ మూడేసి మ్యాచ్లు ఆడితే, ఓ రెండు టీమ్స్ రెండేసి మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. అయితే బుధవారం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆర్సీబీ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో 14 మ్యాచ్లు పూర్తయ్యాయి. చాలా టీమ్స్ మూడేసి మ్యాచ్లు ఆడితే, ఓ రెండు టీమ్స్ రెండేసి మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. అయితే బుధవారం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆర్సీబీ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి.
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ 1.485 నికర రన్ రేట్తో 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ నాయకత్వంలో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదటి రెండు మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించింది. ఈ ప్రదర్శనతో, DC జట్టు 1.320 నికర రన్ రేట్తో మొత్తం 4 పాయింట్లతో రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఆర్సీబీ మొదటి రెండు మ్యాచ్ల్లో గెలిచింది, కానీ మూడవ మ్యాచ్లో ఓడిపోయింది. దీనితో, వారు 1.149 నికర రన్ రేట్తో మొత్తం 4 పాయింట్లతో మూడవ స్థానానికి పడిపోయారు. ఇక తర్వాత స్థానాల్లో వరుసగా గుజరాత్, ముంబై, లక్నో, చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్, కోల్కతా జట్లు ఉన్నాయి.