
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీస్ చేసేసింది.

ఎప్పటిలాగే ఈ మ్యాచ్లో ఓపెనర్గా మైదానంలోకి వచ్చిన స్మృతి మంధాన బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆరంభం నుంచి తుఫాన్ బ్యాటింగ్ చేసిన మంధాన కేవలం 10 పరుగుల తేడాతో హ్యాట్రిక్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయింది.

తన ఇన్నింగ్స్లో 83 బంతులు ఎదుర్కొన్న మంధాన 11 బౌండరీల సాయంతో 90 పరుగుల ఇన్నింగ్స్ను పూర్తి చేసింది. ఈ మ్యాచ్కు ముందు, స్మృతి మొదటి రెండు వన్డేల్లోనూ సెంచరీలు చేసింది.

బెంగళూరులో జరిగిన తొలి వన్డేలో 127 బంతులు ఎదుర్కొన్న స్మృతి.. 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 117 పరుగుల విజయవంతమైన ఇన్నింగ్స్ ఆడింది.

రెండో వన్డేలోనూ స్మృతి బ్యాటింగ్తో సెంచరీ చేసింది. ఈ మ్యాచ్లో 126 బంతులు ఎదుర్కొన్న మంధాన 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 136 పరుగులతో మరో విజయవంతమైన ఇన్నింగ్స్ ఆడింది.

వరుసగా రెండు మ్యాచ్ల్లో 2 సెంచరీలు సాధించిన తొలి భారతీయ మహిళా బ్యాట్స్మెన్గా ఆమె రికార్డు సృష్టించింది. అలాగే భారత్ తరపున అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన మహిళా క్రీడాకారిణుల్లో 7 సెంచరీలతో తొలి స్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్ గురించి మాట్లాడితూ... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 215 పరుగులు చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు సాధించింది.