
India vs Pakistan: భారత్లో జరుగుతున్న అంధుల టీ20 ప్రపంచకప్లో పాల్గొనే పాకిస్థాన్ జట్టుకు వీసాను కేంద్ర హోంశాఖ ఆమోదించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత, టోర్నమెంట్లో పాల్గొనేందుకు జట్టు భారత్కు వెళ్లేందుకు వీలుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పుడు పాకిస్థాన్ ఆటగాళ్లు, అధికారులకు వీసాలు జారీ చేస్తుంది. అంధుల క్రికెట్ ప్రపంచకప్లో పాల్గొనేందుకు 34 మంది పాకిస్థానీ ఆటగాళ్లు, అధికారులకు వీసాలు మంజూరు చేసేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
అంతకుముందు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి వీసా అనుమతి పొందలేదని పాకిస్తాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ (పీబీసీసీ) పేర్కొంది. “ఈ దురదృష్టకర సంఘటన పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టును సందిగ్ధంలో పడేసింది” అని పీబీసీసీ పేర్కొంది. ప్రస్తుత ప్రపంచకప్లో ఫైనల్ భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగే అన్ని అవకాశాలూ ఉన్నాయి. ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే పాకిస్థాన్ టైటిల్ను గెలుచుకునే బలమైన అవకాశం ఉంది.
పాక్ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేయాలని బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తమ ప్రభుత్వానికి విన్నవించినా ఎవరూ వినలేదు. ఈ వివక్షతతో కూడిన చర్య ప్రపంచ అంధుల క్రికెట్కు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో అంతర్జాతీయ ఈవెంట్లను ఆతిథ్యం ఇవ్వకుండా ఉండటానికి భారతదేశంపై కఠిన చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
మంగళవారం ఇక్కడ జరిగిన తమ తొలి మ్యాచ్లో నేపాల్ను 274 పరుగుల భారీ తేడాతో ఓడించి మూడో అంధుల టీ20 ప్రపంచకప్లో భారత్ విజయభేరీ మోగించింది. దీపక్ మాలిక్ (113 నాటౌట్), సునీల్ రమేష్ (106) భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా నేపాల్ జట్టు నిర్ణీత ఓవర్లో తొమ్మిది వికెట్లకు 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ల ముందు నేపాల్ బ్యాట్స్మెన్ ఎవరూ నిలబడలేకపోయారు. సునీల్ రమేష్, దీపక్ మాలిక్ జంట ఇక్కడ కూడా అద్భుతాలు చేసింది. సునీల్ రెండు, దీపక్ మూడు వికెట్లు తీశారు.
అంతకుముందు మ్యాచ్ ప్రారంభం నుంచి నేపాల్ బౌలర్లపై సునీల్ ఆధిపత్యం చెలాయించాడు. అజయ్ కుమార్ ఎక్కువ సేపు ఆదుకోలేక 25 పరుగుల వద్ద ఔటయ్యాడు. కాలు బెణికిపోవడంతో సునీల్ రిటైర్మెంట్ తీసుకుని పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన డి.వెంకటేష్ అజేయంగా 67 పరుగులు చేశాడు. అంధుల టీ20 ప్రపంచకప్లో ఇదే అత్యధిక స్కోరు.
పాకిస్తాన్ జట్టు ఆమోదం పొందిన తర్వాత, ఇప్పుడు 12 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా నుంచి ఏడు జట్లు పాల్గొంటాయి. ఫరీదాబాద్, ఢిల్లీ, ముంబై, ఇండోర్, బెంగళూరులలో మ్యాచ్లు జరుగుతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..