‘చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లందరికీ నెగెటివ్’ !

| Edited By: Pardhasaradhi Peri

Sep 01, 2020 | 6:11 PM

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ఈ టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. గతవారం వీరికి నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్ రాగా తాజాగా నెగెటివ్ వచ్చిందన్నారు. వీరిలో పాజిటివ్ తేలిన..

చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లందరికీ నెగెటివ్ !
Follow us on

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ఈ టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. గతవారం వీరికి నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్ రాగా తాజాగా నెగెటివ్ వచ్చిందన్నారు. వీరిలో పాజిటివ్ తేలిన దీపక్ చాహర్, రుతు రాజ్ గైక్వాడ్ 14 రోజుల క్వారంటైన్ లో ఉన్నారు. ప్రస్తుతం 13 మంది సభ్యులకు సంబంధించి నెగెటివ్ వచ్చిందని, ఈ నెల 3 న వీరికి మరో టెస్ట్ ఉంటుందని విశ్వనాథన్ చెప్పారు. ఆ మరుసటిరోజునుంచి శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం తమ ఆటగాళ్లతో బాటు విశ్వనాథన్ దుబాయ్ లో ఉన్నారు.

దీపక్, రుతు రాజ్ తమ రెండువారాల క్వారంటైన్ ముగించుకుని ప్రోటోకాల్ ప్రకారం రెండు నెగెటివ్ టెస్టుల అనంతరం ట్రెయినింగ్ లో జాయిన్ అవుతారని ఆయన చెప్పారు.