Konaseema: 47 తర్వాత ఘనంగా దాసులమ్మ పంటల జాతర.. సారె, గండ్ర దీపాలు సమర్పించిన మహిళలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లో ముమ్మిడివరం మండలం చెయ్యేరు లో అంగరంగ వైభవంగా దాసులమ్మ పంటల జాతర జరిగింది. అమ్మవారి అనుగ్రహం ఉండాలని.. తమ గ్రామంలో కరువుకాటకాలు రాకుండా సుభిక్షంగా ఉందని జాతరను జరుపుకున్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచులు, కోడళ్ళు అందరూ అఖండ జ్యోతిని వెలిగించి ఊరేగింపుగా ఆలయానికి తరలి వెళ్లి సమర్పించారు.

Konaseema: 47 తర్వాత ఘనంగా దాసులమ్మ పంటల జాతర.. సారె, గండ్ర దీపాలు సమర్పించిన మహిళలు
Panta Jatara In Konaseema

Updated on: Oct 14, 2025 | 7:50 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు లో గ్రామ దేవత దాసులమ్మ పంటల జాతర 47 ఏళ్ల తరువాత అంగరంగ వైభవం గా నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతులు పంటలు పుష్కలంగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ అమ్మవారికి అఖండ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామం లో వేలాది మంది మహిళలు (ఆడపడుచులు,కొడళ్లు బంధువులు) అందరూ తమ ఇంటి వద్ద అఖండ జ్యోతి ని వెలిగించి.. ఆ జ్యోతిని నెత్తిమీద పెట్టుకుని పసుపు, కుంకుమలు, వివిధ రకాల పిండి వంట తో ఊరంతా తిరిగి ఊరేగింపు గా తరలి వెళ్లి అమ్మవారికి సారె, గండ్ర దీపాలను సమర్పించారు.

 

వివిధ రకాల ఆహార పదార్ధాలను నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్తులు తీసుకువచ్చిన నైవేద్యాలను అమ్మవారికి కుంభంగా పోశారు. అనంతరం ఆ ప్రసాదాన్ని గ్రామంలో ఇంటి ఇంటికి పంచుతారు. ఇలా చేయడం ఇక్కడ ఆనవాయితి. అంతేకాదు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. వాస్తవంగా దాసులమ్మ పంటల జాతర ప్రతీ ఐదేళ్లకోసారి జరుపుకునెవరు. అయితే ఈ జాతరను కొన్నేళ్లుగా నిలిపివేశారు. దీంతో ఆనావృష్టి తో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు భావించి 47 ఏళ్ల తరువాత మరలా ఈ జాతర వైభవంగా జరుపుతునట్లు గ్రామస్థులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..