Official: నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. సాయి పల్లవి, కృతి శెట్టి ఫిక్స్‌

నాచురల్‌ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తోన్న చిత్రం శ్యామ్ సింగరాయ్‌. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న

Official: నాని 'శ్యామ్‌ సింగరాయ్‌'.. సాయి పల్లవి, కృతి శెట్టి ఫిక్స్‌
Follow us

| Edited By:

Updated on: Oct 25, 2020 | 1:37 PM

Nani Shyam Singha Roy: నాచురల్‌ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తోన్న చిత్రం శ్యామ్ సింగరాయ్‌. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్లుగా మలార్ బ్యూటీ సాయి పల్లవి, ఉప్పెన ఫేమ్‌ కృతి శెట్టి ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం అందించబోతుండగా.. షాను జాన్ వెర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయబోతున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్‌ కొల్ల ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. నిహారిక ఎంటర్‌టైన్‌పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు

ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని కూడా మూవీ యూనిట్‌ విడుదల చేసింది. అందులో నాని మీసకట్టుతో ఉండగా.. దుర్గమాత, హౌరా బ్రిడ్జి కూడా కనిపిస్తున్నాయి. ఈ మూవీ పశ్చిమబెంగాల్‌ నేపథ్యంలో తెరకెక్కుతుందని ఇటీవల పుకార్లు వినిపించగా.. వాటికి బలం చేకూరుస్తూ ప్రీలుక్ ఉండటం విశేషం. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ నుంచి సెట్స్‌ మీదకు వెళ్లనుంది. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన వారు ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో నిహారిక మూవీస్ శ్యామ్‌ సింగరాయ్‌లో భాగం అయ్యింది.

Read More:

సెక్స్‌ రాకెట్‌: నటుడు అరెస్ట్‌.. ముగ్గురు బుల్లితెర నటులను కాపాడిన పోలీసులు

దాదాపు వంద కోట్లతో రెండు అపార్ట్‌మెంట్లు కొన్న హృతిక్‌..!