నేడు ఈడీ ముందుకు శరద్ పవార్.. ముంబైలో 144 సెక్షన్
ముంబై నగరంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు స్వచ్ఛందంగా వస్తున్నారు. దీంతో ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిషేధ ఉత్తర్వులు విధించారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ఈడీ కార్యాలయానికి శరద్ పవార్ రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు […]
ముంబై నగరంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు స్వచ్ఛందంగా వస్తున్నారు. దీంతో ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిషేధ ఉత్తర్వులు విధించారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ఈడీ కార్యాలయానికి శరద్ పవార్ రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే పరోలా, ముక్తాయ్ నగర్, ఉస్మానాబాద్ పట్టణాల్లో ఎన్సీపీ కార్యకర్తలు బంద్కు పిలుపునిచ్చారు. ముంబై నగరంలోని కొలబా, కుఫీ పరేడ్, మెరెన్ డ్రైవ్, ఆజాద్ మైదాన్, డోంగ్రీ, జేజే మార్గ్, ఎమ్మారే మార్గ్ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడమే కాకుండా.. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.