Lalu Prasad : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు అస్వస్థత.. కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు..
బిహార్ మాజీ ముఖ్యమంత్రి.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే రాంచీ రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఆయనకు ఆకస్మికంగా ఊపిరి తీసుకోవడంలో...
Lalu Prasad under Observation : బిహార్ మాజీ ముఖ్యమంత్రి.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే రాంచీ రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఆయనకు ఆకస్మికంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనట్లుగా వైద్యులు గుర్తించారు. లాలూ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ను గుర్తించినట్టు వైదులు పేర్కొన్నారు. ఇది ఓ రకమైన న్యుమోనియా అని పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స చేస్తున్నట్టు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
కోవిడ్ లక్షణాలు కనిపించడంతో లాలూకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారు నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో కరోనా నెగిటివ్గా తేలంది. అయితే.. ఆర్టీ-పీసీఆర్రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు జైలు సూపరిండెంట్, ఇతర అధికారులు ఝార్ఖండ్లోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి చేరుకున్నారు. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. ఈ మధ్యకాలంలో పలు సందర్భాల్లో తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారు.
ఇవి కూడా చదవండి :
Sasikala Tests Positive : శశికళ అభిమానులకు భారీ షాక్.. చిన్నమ్మకు కరోనా పాజిటివ్..
Strong earthquake : ఫిలిప్పైన్స్లో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు..