Lalu Prasad : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత.. కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు..

బిహార్​ మాజీ ముఖ్యమంత్రి.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే రాంచీ రిమ్స్​ ఆసుపత్రిలో ఉన్న ఆయనకు ఆకస్మికంగా ఊపిరి తీసుకోవడంలో...

Lalu Prasad : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత.. కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు..
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 22, 2021 | 6:09 AM

Lalu Prasad under Observation : బిహార్​ మాజీ ముఖ్యమంత్రి.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే రాంచీ రిమ్స్​ ఆసుపత్రిలో ఉన్న ఆయనకు ఆకస్మికంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనట్లుగా వైద్యులు గుర్తించారు. లాలూ ఊపిరితిత్తుల్లో ఇన్​ఫెక్షన్​ను గుర్తించినట్టు వైదులు పేర్కొన్నారు. ఇది ఓ రకమైన న్యుమోనియా అని పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స చేస్తున్నట్టు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

కోవిడ్ లక్షణాలు కనిపించడంతో లాలూకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారు నిర్వహించిన ర్యాపిడ్​ యాంటిజెన్​ పరీక్షలో కరోనా నెగిటివ్‌గా తేలంది. అయితే.. ఆర్​టీ-పీసీఆర్​రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు జైలు సూపరిండెంట్​, ఇతర అధికారులు ఝార్ఖండ్‌లోని రాజేంద్ర ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి చేరుకున్నారు. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. ఈ మధ్యకాలంలో పలు సందర్భాల్లో తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి :

Sasikala Tests Positive : శశికళ అభిమానులకు భారీ షాక్.. చిన్నమ్మకు కరోనా పాజిటివ్..

Strong earthquake : ఫిలిప్పైన్స్‌లో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు..