క్వారంటైన్‌ కేంద్రాన్ని తరలించండి.. ఎమ్మెల్యే ఆందోళన..!

కరోనా పాజిటివ్‌ రోగులకు, అనుమానితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని తరలించాలంటూ ఓ ఎమ్మెల్యే ఆందోళన చేస్తున్నారు. తమ ప్రాంతంలో కరోనా కారణంగా అందరూ ఆందోళన చెందుతున్నారని, ఈ క్రమంలో క్వారంటైన్‌ కేంద్రాన్ని ఎత్తివేయాలంటూ ఆయన కలెక్టరేట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. కాగా కరోనా నేపథ్యంలో నాగ్‌పూర్ హిగ్నా ప్రాంతంలోని వనదొంగ్రీలో ఉన్న బాబాసాహెబ్‌ బాలుర హాస్టల్‌లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది […]

క్వారంటైన్‌ కేంద్రాన్ని తరలించండి.. ఎమ్మెల్యే ఆందోళన..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 25, 2020 | 9:51 AM

కరోనా పాజిటివ్‌ రోగులకు, అనుమానితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని తరలించాలంటూ ఓ ఎమ్మెల్యే ఆందోళన చేస్తున్నారు. తమ ప్రాంతంలో కరోనా కారణంగా అందరూ ఆందోళన చెందుతున్నారని, ఈ క్రమంలో క్వారంటైన్‌ కేంద్రాన్ని ఎత్తివేయాలంటూ ఆయన కలెక్టరేట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

కాగా కరోనా నేపథ్యంలో నాగ్‌పూర్ హిగ్నా ప్రాంతంలోని వనదొంగ్రీలో ఉన్న బాబాసాహెబ్‌ బాలుర హాస్టల్‌లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది ఏ మాత్రం సమంజసం కాదని, దీన్ని వెంటనే ఎత్తివేయాలని ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సమీర్ మెఘే ఆందోళన చేశారు. తమ ప్రాంతంలో జన సాంద్రత అధికంగా ఉందని.. కరోనాతో అందరూ ఆందోళన చెందుతున్నారని.. అందుకే క్వారంటైన్‌ కేంద్రాన్ని ఇక్కడ మూసివేసి.. మరోచోట తెరవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Read This Story Also: లాక్‌డౌన్ నిబంధనలు మరింత సడలింపు.. వాటికి అనుమతి.. కొన్ని షరతులు..!