ఏపీ క్రీడల బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు..?

ఆంధ్రప్రదేశ్ క్రీడల బ్రాండ్ అంబాసిడర్ గా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును నియమించే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఆమెను ఈ పదవిలో నియమించాలని సీఎం జగన్ ను కోరతానని క్రీడలశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒలింపిక్ డే రన్ లో పాల్గొన్నఆయన.. దేశంతో పాటు రాష్ట్రానికి ఎంతో కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన సింధూ నియామకంపై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. కాగా  విజయవాడ మహాత్మా గాంధీ […]

ఏపీ క్రీడల బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు..?
Follow us

|

Updated on: Jun 23, 2019 | 12:09 PM

ఆంధ్రప్రదేశ్ క్రీడల బ్రాండ్ అంబాసిడర్ గా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును నియమించే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఆమెను ఈ పదవిలో నియమించాలని సీఎం జగన్ ను కోరతానని క్రీడలశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒలింపిక్ డే రన్ లో పాల్గొన్నఆయన.. దేశంతో పాటు రాష్ట్రానికి ఎంతో కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన సింధూ నియామకంపై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. కాగా  విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి డీవీ మానర్ హోటల్‌ వరకు జరిగిన రన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ పాల్గొన్నారు.