Prabhas 21:ప్రభాస్నే ఎంచుకోవడానికి కారణం అదే: నాగ్ అశ్విన్
టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ప్రభాస్తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తదుపరి సినిమాను చేయబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి.. ఇటు ఫ్యాన్స్తో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు మొదలయ్యాయి.
టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ప్రభాస్తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తదుపరి సినిమాను చేయబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి.. ఇటు ఫ్యాన్స్తో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు మొదలయ్యాయి. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు మిగిలిన ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఇటీవల మాట్లాడిన నాగ్ అశ్విన్.. ఈ ప్రాజెక్ట్ను ప్రభాస్ను ఎంచుకోవడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చారు.
తాను రాసుకున్న పాత్రకు ప్రభాస్ తప్ప.. సినిమా ఇండస్ట్రీలోనే మరో హీరో సరిపోరని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. బడ్జెట్ పరంగా మాత్రమే కాదు. ఆ పాత్రను పోషించగలిగిన సత్తా ప్రభాస్కు తప్ప మరెవరికి లేదనిపించిందని అన్నారు. ఇక సై-ఫై కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుందని, ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదని తెలిపారు. అలాగే పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఉండబోతుందని స్పష్టతను ఇచ్చారు. కథను విన్నప్పుడు ప్రభాస్ చాలా ఎగ్జైట్ అయ్యారని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు మూవీలో ఎమోషనల్ సీన్లు కూడా చాలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తామని.. వచ్చే ఏడాది చివరి విడుదల చేయాలనుకుంటున్నామని నాగ్ అశ్విన్ తెలిపారు.
కాగా దాదాపు రూ.400కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ నిర్మిస్తుండగా.. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి.
Read This Story Also: ప్రభాస్ జోడీగా ఆ ఇద్దరు హీరోయిన్లు..!