మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు: నాదెండ్ల మనోహర్

|

Mar 08, 2019 | 10:20 AM

విజయవాడ: జనసేన, వామపక్ష పార్టీలు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, జనసేన నేత నెదెండ్ల మనోహర్ మాట్లాడారు. వామపక్ష పార్టీలకు, జనసేనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో తమ పార్టీల బలాబలాలపై చర్చలు జరిపినగ్గు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మరోసారి భేటీ అవుతాము. అప్పుడు సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వస్తుందని మనోహర్ చెప్పారు. సీపీఎం మధు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీలకు […]

మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు: నాదెండ్ల మనోహర్
Follow us on

విజయవాడ: జనసేన, వామపక్ష పార్టీలు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, జనసేన నేత నెదెండ్ల మనోహర్ మాట్లాడారు. వామపక్ష పార్టీలకు, జనసేనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో తమ పార్టీల బలాబలాలపై చర్చలు జరిపినగ్గు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మరోసారి భేటీ అవుతాము.

అప్పుడు సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వస్తుందని మనోహర్ చెప్పారు. సీపీఎం మధు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీలకు తమ కూటమే సరైన ప్రత్యామ్నాయమని అన్నారు. సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ డబ్బుల రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓట్లను తొలగించి గెలవాలని చూస్తున్నారు, ఆ పార్టీలకు వలివల్లేవని రామకృష్ణ అన్నారు.