ఫ్యాన్, హెలికాప్టర్ గుర్తులు ఒకేలా ఉన్నాయట!

విజయవాడ: ఫ్యాన్, హెలికాప్టర్ గుర్తులు ఒకేలా ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. జగన్‌కు మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన డేటా చోరీ ప్రైవేట్ డేటా విషయంలో చంద్రబాబు ఇంత దిగజారతారనుకోలేదని విమర్శించారు. ఇది సైబర్ క్రైమ్ ఇలాంటి నేరాలకు అమెరికాలో అయితే 25 ఏళ్ల జైలు శిక్ష వేస్తారని పాల్ అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏడాదిలోపే పలు పథకాలు […]

ఫ్యాన్, హెలికాప్టర్ గుర్తులు ఒకేలా ఉన్నాయట!

Updated on: Mar 08, 2019 | 10:22 AM

విజయవాడ: ఫ్యాన్, హెలికాప్టర్ గుర్తులు ఒకేలా ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. జగన్‌కు మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన డేటా చోరీ ప్రైవేట్ డేటా విషయంలో చంద్రబాబు ఇంత దిగజారతారనుకోలేదని విమర్శించారు. ఇది సైబర్ క్రైమ్ ఇలాంటి నేరాలకు అమెరికాలో అయితే 25 ఏళ్ల జైలు శిక్ష వేస్తారని పాల్ అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏడాదిలోపే పలు పథకాలు అమలు చేస్తానని అన్నారు. ఏపీని మరో అమెరికాలా చేస్తానని వెల్లడించారు.