టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న చిరుమర్తి లింగయ్య

| Edited By:

Mar 08, 2019 | 10:32 AM

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ దిశగా నల్గొండలో మంత్రి జగదీష్ రెడ్డితో భేటీ అయిన లింగయ్య, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తోను భేటీ అయినట్లు సమాచారం. లింగయ్య కొమటిరెడ్డి బ్రదర్స్‌కు ముఖ్య అనుచరుడు. లింగయ్యకు కాంగ్రెస్ టిక్కెట్ రావడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అత్యంత కీలకం కాగా.. ఇప్పుడు లింగయ్య అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం […]

టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న చిరుమర్తి లింగయ్య
Follow us on

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ దిశగా నల్గొండలో మంత్రి జగదీష్ రెడ్డితో భేటీ అయిన లింగయ్య, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తోను భేటీ అయినట్లు సమాచారం. లింగయ్య కొమటిరెడ్డి బ్రదర్స్‌కు ముఖ్య అనుచరుడు. లింగయ్యకు కాంగ్రెస్ టిక్కెట్ రావడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అత్యంత కీలకం కాగా.. ఇప్పుడు లింగయ్య అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశమైంది.