చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. వివో వై27 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
వివో వై27 స్మార్ట్ ఫోన్లో 1080×2388 పిక్సెల్ రిజల్యూషన్తో కూడి 6.64 ఇంచెస్ ఫుల్హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ వివో అధికారిక వెబ్సైట్తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ సైట్స్ అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో ఫోన్ పనిచేస్తుంది. వివో వై27 బుర్గుండి బ్లాక్, సీ బ్లూ, గార్డెన్ గ్రీన్ కలర్స్లో అందుబాటులో ఉంది.
ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ రూ. 14,999కి అందుబాటులో ఉంది. ఫింగర్ప్రింట్ సెన్సార్ను ఫోన్ బ్యాక్ సైడ్ అందించారు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.