
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కస్టమర్స్కి శుభవార్త చెప్పింది. తమ కంపెనీకి చెందిన రెండు ఫోన్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వివో వై16, వివో వై02టీ ఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్లు వివో అధికారికంగా ప్రకటించింది.

తగ్గించిన ధరల తర్వాత వివో వై16 బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 10,499గా ఉండనుంది. ఇక 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 11,999గా ఉంది. ఇక వివోవై02 టీ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,999కి లభించనుంది.

ఇక ఈ ఫోన్ల ఫీచర్స్ విషయానికొస్తే.. వివో వై 16, వివో వై20 టీ రెండు ఫోన్స్లోనూ మీడియా టెక్ హీలియో పీ35 ఎస్ఓసీ చిప్సెట్ను అందించారు. 10 వాట్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే వివో వై 16 స్మార్ట్ ఫోన్లో 16 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే వివో వై02 టీ ఫోన్లో 8 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్స్లో నో కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తున్నారు. ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి ఈ ఆప్షన్ వర్తిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వివో అధికారిక వెబ్సైట్తో పాటు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సైట్స్లో అందుబాటులో ఉన్నాయి.