
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. టెక్నో స్పార్క్ 20 పేరుతో భారత్లో కొత్త ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే మార్కెట్లోకి ఈ ఫోన్ రానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ను సైబర్ వైట్, గ్రావిటీ బ్లాక్, మ్యాజిక్ స్కిన్ బ్లూ, నియాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్లో తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే రూ. 10,499గా ఉండనున్నట్లు తెలుస్తోంది. లాంచింగ్ ఆఫర్లో భాగంగా డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.6 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించనున్నారు. ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90Hzగా ఉంటుంది. ఇక ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్ కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్లో వెనుక, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు రెండూ LED ఫ్లాష్ను కలిగి ఉంటాయి. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తో లాంచ్ చేయనున్నారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు.