
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో తాజాగా కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. టెక్నో ఫాంటం వీ ఫోల్డ 2 పేరుతో ఈ ఫోనను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే గ్లోబల్ మార్కెట్తో పాటు భారత్లో కూడా ఈ ఫోన్ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 92000 నుంచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ను మొత్తం మూడు కలర్ వేరియంట్సలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది

ఫీచర్ల విషయానికొస్తే టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్సెట్తో పనిచేయనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ను 128 జీబీ ర్యామ్, 512 జీబీ ర్యామ్ వేరియంట్తో తీసుకొస్తున్నారు. అలాగే ఈ ఫోన్ 5750 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది.

ఇక ఈ ఫోన్లో 6.42 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ ఎల్టీపీఓ అవుటర్ డిస్ప్లేను ఇవ్వనున్నారు. ఈ స్క్రీన్ 2550x1080 పిక్సెల్ రిజల్యూషన్ సెటప్తో అందుబాటులోకి రానుందని తెతలుస్తోంది.

మరో స్క్రీన్ను 7.85 ఇంచెస్తో రానుందని సమాచారం. స్క్రీన్ 2కే రిజల్యూషన్తో రానుంది. కెమెరా విషయానికొస్త ఇందులో.. 32-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఇవ్వనున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఇవ్వనున్నారు.