
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తోన్న తరుణంలో రియల్మీ కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. రియల్మీ 10ప్రో+ పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ ఫోన్ను తక్కువ బడ్జెట్లో తీసుకురావడం విశేషం.

ఈ ఫోన్ ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 24,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 25,999గా ఉంది. డార్క్ మ్యాటర్, నెబులా బ్లూ, హైపర్ కేస్ గోల్డ్ కలర్స్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్ను 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ + అమోఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లేతో రూపొందించారు. 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లేకి 10 బిట్ ప్యానెల్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్ఓసీతో పనిచేసే ఈ స్మార్ట్ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 12 జీబీ వరకు ర్యామ్ను ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కల్పించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ఫోన్లో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్తో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్ను అందించారు.