
ఆండ్రాయిడ్ 15లో ఫోన్ సెక్యూరిటీ కోసం పెద్ద పీట వేశారు. థెఫ్ట్ ప్రొటెక్షన్ కింద 3 కొత్త భద్రతా ఫీచర్లను తీసుకొచ్చింది. ఇవి చోరీకి గురైన సందర్భాల్లో ఫోన్ స్క్రీన్ను ఆటోమెటిక్గా లాక్ చేస్తాయి. స్మార్ట్ ఫోన్ చోరికి గురైతే ఈ ఫీచర్ ఏఐ టెక్నాలజీతో గుర్తించి వెంటనే మొబైల్ స్క్రీన్ను లాక్ చేసేస్తుంది.

ఆండ్రాయిడ్ 15లో ప్రైవేట్ స్పేస్ ఫీచర్ను అందించారు. ఈ ఫీచర్ను లాక్ చేస్తే మీ ఫోన్లోని యాప్స్ ఇతరులకు కనిపించవు. అలాగే యాప్ లిస్ట్, రీసెంట్ యాప్స్ వ్యూ, సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ కూడా కనిపింకుండా చేసేందుకు ఈ ఫీచర్ ఉయోగపడుతుంది.

ఆండ్రాయిడ్ 15తో పిక్సెల్ ఫోల్డబుల్ లేదా పిక్సెల్ ట్యాబ్లెట్ యూజర్లు.. కస్టమైజ్డ్ లేఅవుట్ను ఉపయోగించుకోవచచు. ఇందుకోసం స్క్రీన్పై పై తమ టాస్క్ బార్ను పిన్, అన్పిన్ చేసకోవచ్చు. దీంతో పాటు యాప్స్ పెయిర్స్ కోసం షార్ట్ కక్ట్స్ను కూడా సేవ చేసుకోవచ్చు. ఇది స్ప్లిట్ స్కీన్లో మల్టీ టాస్కింగ్లు చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్తో క్యారియర్ మెసేజింగ్ యాప్స్ మొబైల్ లేదా వైఫై కనెక్షన్ లేకుండా మెసెజెస్ను పంపించేందుకు, రిసీవ్ చేసుకునేందుకు.. శాటిలైట్ కనెక్టివిటీని యూజ్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.

గూగుల్కు సంబంధించిన అన్ని రకాల పిక్సెల్ ఫోన్లో ఈ ఫీచరను తీసుకొచ్చారు. ఇక ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన ప్రధానమైన మార్పుల్లో యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్, పాస్కీలకు మెరుగైన సపోర్ట్, థర్డ్ పార్టీ యాప్స్ కోసం అడ్వాన్స్డ్ కెమెరా కంట్రోల్స్ వంటివి ఉన్నాయి.