
నిజమైన ప్రేమకు చిహ్నంగా, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా, భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా 'తాజ్ మహల్'కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు.

ప్రస్తుతం తాజ్ మహల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు తాజ్ మహల్ నిర్మాణ సమయంలో కొన్ని దృశ్యాలను చూపుతున్నాయి. 370 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తాజ్ మహల్ గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజ్ మహల్ నిర్మాణం తర్వాత మరెవరూ అలాంటి నిర్మాణాన్ని నిర్మించకూడదని షాజహాన్ కూలీల చేతులు నరికివేశాడని చెబుతారు.

ఈ వైరల్ ఫోటోలు తాజ్ మహల్ నిర్మాణానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను చూపుతున్నాయి. ఇందులో కూలీలు పనిచేస్తున్నారు. తాజ్ మహల్ ఎత్తైన మినార్లను ఎలా నిర్మించారో కూడా ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోలు చూస్తుంటే మీరు కూడా మైమరచిపోతారు. తాజ్ మహల్ ను చూసిన తర్వాత ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం మరెక్కడా చూడలేం అనే భావన కలుగుతుంది.

శతాబ్ధాలు గడిచినా నేటికీ చెక్కుచెదరకుండా ఈ నిర్మాణం నిలిచిందంటే అందులో వినియోగించిన సాంకేతికత, నిర్మాణ సామగ్రి ఎంతో ధృడమైనదని నమ్మక తప్పదు. తాజ్ మహల్ నిర్మాణాన్ని వర్ణించే ఈ ప్రత్యేక ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ jyo_john_mulloorలో షేర్ చేశారు.

షాజహాన్ అద్భుతమైన వారసత్వాన్ని రూపొందించడంలో ఒక సంగ్రహావలోకనం. అలాగే, షాజహాన్ అనుమతి తర్వాతే ఈ అరుదైన ఛాయాచిత్రాలను షేర్ చేశామంటూ ఫోటోలకు సరదాగా క్యాప్షన్ రాశారు.