ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సీజన్-18 ఈ రోజు ప్రారంభం కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్లో ఆర్సీబీ, కెకెఆర్ తలపడనున్నాయి. అయితే ఇంకా ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాకముందే.. ప్లేఆఫ్స్కు వెళ్లే ఆ నాలుగు టీమ్స్ ఏంటో చెప్పేవాడు టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. మరి ఆ నాలుగు టీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి మరింత బలంగా ఉంది. అందువల్ల, ఈసారి ముంబై జట్టు నుండి మంచి ప్రదర్శన ఆశించవచ్చు. వారు ప్లేఆఫ్స్కు చేరుకోవడం ఖాయమని సెహ్వాగ్ కూడా అన్నాడు.
ఇక రెండో టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్. గతసారి ఫైనల్కు చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అలాంటి మార్పు లేదు. SRH ఈసారి కూడా టాప్ 4 లో చోటు దక్కించుకుంటుందని వీరు అంచనా వేశాడు, ముఖ్యంగా వారి బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నందని పేర్కొన్నాడు.
మూడో టీమ్ పంజాబ్ కింగ్స్. ఈసారి పంజాబ్ కింగ్స్ సమతుల్య లైనప్ను కలిగి ఉంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారని, కాబట్టి వారు ప్లేఆఫ్స్కు చేరుకోవడానికి ఎదురుచూడవచ్చని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఇక నాలుగో టీమ్ వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్. LSG ఫ్రాంచైజీ జట్టులో గణనీయమైన మార్పు జరిగింది, రిషబ్ పంత్ కెప్టెన్గా జట్టులోకి వచ్చాడు. అలాగే, జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లేఆఫ్స్ ఆడుతుందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.
అయితే, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్కు చేరుకోవడం సందేహమేనని ఆయన అన్నారు. ఈ సంవత్సరం ఐపీఎల్ లీగ్ దశ ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు టాప్-4లో చోటు దక్కించుకుంటాయో లేదో, సెహ్వాగ్ చెప్పింది జరుగుతుందో లేదో చూడా