
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏ పని చేసినా తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు. అయితే తెలియక చేసే కొన్ని పనులే ఇంటి లోపల కలహాలకు కారణం అవుతుందంట. అయితే ఎలాంటి సమస్యలు ఇంటిలో సమస్యలను తీసుకొస్తాయనేది చూద్దాం. రాత్రి పూట ఎలాంటి తప్పులు చేయకూడదు, ఏ పనులు చేయడం వలన ఇంటిలో శాంతి నెలకొని, కుటుంబం ఆనందంగా ఉంటుందో చూద్దాం.

రాత్రి సమయంలో ఇల్లు ఊడ్చకూడదు అంటారు. ముఖ్యంగా సాయంత్రం 6 తర్వాత ఇంటిని ఊడ్చడం అశుభ కరం అంటారు. కానీ కొంత మంది ఇవేవి పట్టించుకోకుండా రాత్రి సమంయలో ఇంటిని ఈడ్చుకుంటారు. అయితే రాత్రి సమయంలో ఇంటిని ఊడ్చడం వలన సానుకూల శక్తి తగ్గిపోయి, ప్రతికూల శక్తి పెరుగుతుంది. అలాగే ఇది ఇంటిలోపల కలహాలకు కూడా కారణం అవుతుందంట. ఎవరు అయితే రాత్రి సమయంలో కూడా ఇంటిని ఊడ్చుతారో, వారి ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

ఇక కొంత మంది బెడ్ రూమ్ విషయంలో తెలిసి తెలియ కొన్ని తప్పులు చేస్తుంటారు. బెడ్ రూమ్ సర్దుకోకుండా, బెడ్ రూమ్లోని వస్తువుల చెల్లా చెదురుగా ఉండగానే నిద్రపోతుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదంట. బెడ్ రూమ్లో పాత వస్తువులు, బూట్లు, ఇతర వస్తువులు చిందరవందరగా ఉండటం వలన ప్రతి కూల శక్తి పెరిగి, చిరాకు, అలసట, నిద్ర సరిగ్గా పట్టక పోవడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

కొంత మంది రాత్రి సమయంలో కుటుంబంతో ఆనందంగా మాట్లాడాల్సింది పోయి, అనవసరమైన గొడవలు సృష్టిస్తారు. అంతే కాకుండా, నెగటివ్గా మాట్లాడటం, కుటుంబ సభ్యులతో ప్రతి విషయంలో వాదించడం లాంటిది చేస్తారు. దీని వలన ఇంటిలో మానసిక ఒత్తిడి పెరుగుతుందంట. అలాగే ఇంటిలోపల గొడవలకు కారణం అవుతుందంట.

ఇక కొంత మంది ఉదయం పూజ చేస్తే , మరికొంత మంది రాత్రి సమయంలో పూజ చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, సాయంత్రం వేళల్లో పూజ చేసిన తర్వాత పూజగది తలపులు మూసి వేయాలంట. రాత్రి సమయంలో ప్రార్థనా మందిరం డోర్స్ తెరిచి ఉండటం వలన వాస్తు దోషం కలుగుతుంది. ఇది మీ కుటుంబంలో అశాంతికి కారణం అవుతుంది. దీని వలన ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యల బారినపడాల్సి వస్తుందంట.