
సూర్యుడు ఫిబ్రవరి 6 వ తేదీన ధనిష్ట నక్షత్రంలోకి సంచరిస్తాడు. తర్వాత ఫిబ్రవరి 13న కుంభరాశిలోకి ప్రేశిస్తాడు, తర్వాత ఫిబ్రవరి 19న శతభిషా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. ఇది 12 రాశుల పై ప్రభావం చూపుతుంది. కానీ నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని ప్రయోజనాలు చేకూరేలా చేస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

మేష రాశి: మేష రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఎక్కువ మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది మంచి సమయం. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కూడా వీరికి కలిసి వస్తుంది. ప్రతీ పనిలో విజయం చేకూరుతుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందుతారు. కళారంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందుతారు. ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని పొందుతారు. చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి సూర్యడి సంచారం వలన లక్కు కలిసి వస్తుంది. వీరు అనుకున్నపనులన్నీ సరైన సమయంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.