
మేషరాశి: సూర్య గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది మానసిక ప్రశాంతతను, చేపట్టిన పనుల్లో విజయం లభించేలా అవకాశాలను పెంచుతుంది.

వృషభ రాశి: గ్రహణం విడిచిన అనంతరం లక్ష్మీ దేవిని పూజించి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దీనివల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతాయి.

మిథున రాశి: శ్రీకృష్ణుడిని పూజించి ఓం నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ తెలివితేటలను, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.

కర్కాటక రాశి : శివుడికి అభిషేకం చేసి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇది వ్యాధి,యు ప్రతికూల శక్తి నుంచి ఉపశమనం లభించడంలో సహాయపడుతుంది.

సింహ రాశి: వీరు గ్రహణ సమయంలో సూర్య భగవానుడికి ప్రార్థనలు చేసి, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది వీరి ఆత్మవిశ్వాసాన్ని , కీర్తిని పెంచుతుంది.

కన్య రాశి: గ్రహణ విడిచిన తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేసి దుర్గాదేవిని పూజించండి. ఇది జీవితంలో స్థిరత్వం, విజయాన్ని తెస్తుంది.

తులా రాశి: శ్రీ సూక్త పారాయణం చేసి.. లక్ష్మీ దేవికి కమలం పువ్వులతో పూజించండి. ఇది వ్యాపారం, వృత్తిలో ప్రయోజనాలను తెస్తుంది.

వృశ్చిక రాశి: హనుమంతుడిని పూజించి, ఓం రామదూతయే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది చేపట్టిన పనుల్లో అడ్డంకులను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

ధనుస్సు రాశి: గాయత్రి మంత్రాన్ని జపించి విష్ణువును పూజించండి. ఇది మానసిక ప్రశాంతతను , ఆధ్యాత్మిక పురోగతిని తెస్తుంది.

మకర రాశి: వీరు శని దేవుడిని పూజించి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ పనికి స్థిరత్వాన్ని తెస్తుంది . అడ్డంకులను తగ్గిస్తుంది.

కుంభ రాశి: గ్రహణ సమయంలో "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని జపించి శివలింగానికి నీటిలో బిల్వ పత్రాలు వేసి అబిషేకం చేయండి. ఈ పరిహారం వీరి జీవితంలో సానుకూలతను, శాంతిని తెస్తుంది.

మీన రాశి: విష్ణువును ధ్యానించి ఓం వాసుదేవ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది కుటుంబ ఆనందాన్ని, మానసిక సమతుల్యతను తెస్తుంది.